మాది బెస్త సామాజిక వర్గం. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. రెండేళ్లయినా ఇంత వరకూ అతీగతీ లేదు. నాకు 58 ఏళ్లు. పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాను. అధికారులను అడిగితే చంద్రబాబునే అడుగు..అని అంటున్నారు.
– జి.గోవిందు, ఉప్పార్లపల్లి,
నల్లచెరువు మండలం
ఏం సాధించారని సంబరాలు
టీడీపీ నేతలు ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారు?. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టినందుకా?. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా?. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మోసం చేసినందుకా?. ఉచిత పంటల బీమాకు మంగళం పాడినందుకా? లేదంటే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకా?. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. – ఉషశ్రీ చరణ్,
జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ


