ఎస్‌ఆర్‌ఐటీలో ఉద్యోగాల పంట | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఐటీలో ఉద్యోగాల పంట

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

ఎస్‌ఆర్‌ఐటీలో ఉద్యోగాల పంట

ఎస్‌ఆర్‌ఐటీలో ఉద్యోగాల పంట

అనంతపురం: బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్దనున్న శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ) కళాశాలలో 400 మంది విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో కొలువులు సాధించారు. ప్రముఖ బహుళజాతి సంస్థలు అయిన టీసీఎస్‌, కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ తదితర వాటిల్లో కొలువులు దక్కించుకున్నారు. ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం పొందనున్నారు. కాగ్నిజెంట్‌ కంపెనీలో 98 మంది, టీసీఎస్‌లో 157, ఇన్ఫోసిస్‌లో 21, హెచ్‌సీఎల్‌ టెక్‌లో 16, క్యాడ్‌ఎస్‌వైఎస్‌, లూమిన్‌, ప్లేటో, ఫోక్స్‌కాన్‌, ఐఆర్‌ఎంఏఐ కంపెనీల్లో 118 మందికి ఉద్యోగాలు వరించాయి. క్యాంపస్‌ కొలువులు అత్యధికంగా సాధించిన కళాశాలగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఎస్‌ఆర్‌ఐటీ అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఈ నెల 26న కంపెనీల్లో ఉద్యోగాలకు చేరనున్నారు. ఈ మేరకు ఆఫర్‌ లెటర్లు సైతం ఆయా కంపెనీలు ఇచ్చాయి. ఈ సందర్భంగా శనివారం ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపకబృందం అభినందించింది. కార్యక్రమంలో ఇండస్ట్రీ రిలేషన్స్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.బాలకృష్ణ పాల్గొన్నారు

400 మంది విద్యార్థులకు

క్యాంపస్‌ కొలువులు

టీసీఎస్‌కు 157,

కాగ్నిజెంట్‌కు 98 మంది ఎంపిక

కళాశాలకు, కంపెనీకి అనుసంధానం

విద్యార్థుల శ్రమకు, అధ్యాపకుల మార్గదర్శనానికి నిదర్శనమే ఈ ఫలితాలు. కళాశాలకు, కంపెనీకి అనుసంధానంతోనే సంచలన ఫలితాలు సాధ్యమయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ కొలువులు పొందాలంటే ఎస్‌ఆర్‌ఐటీకే సాధ్యమని నిరూపించాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తర్ఫీదు ఇస్తున్నాం. మంచి కంపెనీల్లో కొలువులు దక్కిన విద్యార్థులందరికీ అభినందనలు. – ఆలూరు సాంబశివారెడ్డి,

కరస్పాండెంట్‌, ఎస్‌ఆర్‌ఐటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement