
ఏయ్.. మమ్మల్నే ప్రశ్నిస్తారా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదు అందడమే తరువాయిగా కనీస విచారణ జరపకుండానే కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఈ తరహా పరిస్థితులు కావలిలో మరింత శ్రుతిమించాయి. రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో ఖాకీలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేసుల విషయంలో అత్యున్నత న్యాయస్థానాలు మందలిస్తున్నా, వీరికి ఏ మాత్రం పట్టడంలేదు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన నేతలతో పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసుల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు.
కావలిలో ఇదీ తీరు..
● పైలాన్ ధ్వంసం కేసులో 12 మందిపై నాన్బెయిలబుల్ కేసును కావలి రెండో పట్టణ పోలీసులు నమోదు చేసి నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిలో ఐదుగురు ముందస్తు.. మరో ముగ్గురు ఇంటర్నల్ బెయిల్ పొందారు.
● దగదర్తిలో టీడీపీ నేత తన స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల్లో గల గెస్ట్హౌస్లో మందు పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలు ఓ సోషల్ మీడియా గ్రూపులో వచ్చాయి. వాటిని ప్రభావతి.. ఇతరుల వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేశారనే కారణంతో ఆమైపె కేసు నమోదు చేశారు.
● సోషల్ మీడియాలో వీర రఘు, శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, మాచర్ల సుందరరాజు యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను ఫార్వార్డ్ చేస్తున్నారంటూ వీరిపై పోలీసులకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పలు కేసులు నమోదయ్యాయి.
● ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తున్నారంటూ కావలి పట్టణంలోని 11వ వార్డుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆత్మకూరు రాజేష్పై టీడీపీ నేతల ఫిర్యాదుతో రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు కాగా, మరో దాంట్లో రిమాండ్కు వెళ్లారు.
● సోషల్ మీడియా యాక్టివిస్ట్ దామెర్ల శ్రావణ్కుమార్పై కావలి పోలీసులు రెండు, ఒకటో పట్టణ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. రెండు కేసుల్లో బెయిల్ మంజూరుకాగా, మరో అంశంలో రిమాండ్కు వెళ్లారు.
● సోషల్ మీడియా యాక్టివిస్ట్ బెహరా లక్ష్మీనారాయణపై కావలి ఒకటి, రెండో పట్టణ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో బెయిల్ మంజూరైంది.
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరుసు మౌళీశంకర్పై కావలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసును ఇటీవల కేసు నమోదు చేయగా, బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
● బోగోలు మండలం కడనూతలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మారణాయుధాలతో దాడి చేశారు. అయితే తిరిగి ఆ పార్టీ నేత బాబుతో పాటు మరో ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
● ఏఎంసీ మాజీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పది రోజుల క్రితం నమోదు చేశారు.
● విజయదుర్గ హోటల్కు తాళాలేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఈతముక్కల చంద్రశేఖర్రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ను మంజూరు చేశారు.
భావప్రకటన స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం
వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా స్కెచ్
అక్రమ కేసులతో వేధింపులు
కావలిలో శ్రుతిమించుతున్న రెడ్బుక్ రాజ్యాంగం
ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించే హక్కును రాజ్యాంగం కల్పించింది. దీనికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా శిక్షార్హులేననే విషయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తూ.. పౌరుల హక్కులను కాలరాస్తోంది. ప్రశ్నించే వారిపై ఉక్కుపాదాన్ని మోపి పైశాచికానందాన్ని పొందుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే నేరమనే రీతిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులను బనాయిస్తోంది. అధికారం ఉందనే ధీమాతో పోలీసులను ఉసిగొల్పి తీవ్రంగా వేధిస్తోంది.
మీపై కేసులు
కట్టాం.. రండి