ఆరోగ్య యోగం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య యోగం

Jun 22 2025 11:44 AM | Updated on Jun 22 2025 11:44 AM

ఆరోగ్య యోగం

ఆరోగ్య యోగం

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నెల్లూరులో అట్టహాసంగా శనివారం నిర్వహించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పెద్ద సంఖ్యలో యోగా విన్యాసాలు చేశారు. వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడారు. జిల్లాలోని ఏడు వేల ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 11 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు. యోగా జీవన విధానంలో భాగం కావాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లా మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా, క్రీడాభివృద్ధి సంస్థ అధికారి యతిరాజ్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరించారు. అవెన్యూ స్కూల్‌ విద్యార్థినులు సహస్ర, లయశ్రీ, జనన్య తదితరులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కో ఆర్డినేటర్‌ ప్రసన్నకుమార్‌, శిక్షకులు సెలీనా, అరుణ సుకన్య, శైలజ, పద్మజ, ప్రసూన, గాయత్రి, ప్రసన్న తదితరులకు జ్ఞాపికలను అందజేశారు. ఎస్పీ కృష్ణకాంత్‌, జేసీ కార్తీక్‌, కమిషనర్‌ నందన్‌, డీఆర్వో ఉదయభాస్కర్‌, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement