IND vs BAN: బంగ్లాదేశ్‌పై అద్భుత విజయం.. శ్రీలంకను వెనక్కి నెట్టిన టీమిండియా! ఫైనల్‌ రేసులో రోహిత్‌ సేన

Team india hopes alive of making it to World Test Championship FINAL - Sakshi

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు చేరేందుకు టీమిండియా మరో అడుగు ముందుకు వేసింది. ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 55.7 శాతంతో శ్రీలంకను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (75 శాతం), దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఫైనల్‌ రేసులో నిలవాలంటే మిగిలిన ఐదు టెస్టుల్లో నాలుగింటిలో విజయం సాధిస్తే చాలు. దక్షిణాఫ్రికాను వెనుక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటుంది.

కాగా భారత్‌ తమ తదుపరి టెస్టు సిరీస్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 5 మ్యాచ్‌ల్లో విజయం సాదించగా.. 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 
చదవండిIND vs BAN 1st Test: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top