ముంబైని ఓడించ‌డం అంత ఈజీ కాదు.. టాప్‌-2లో నిలుస్తుంది: హర్భజన్ | Mumbai Indians Will Finish In Top Two: Harbhajan Singh | Sakshi
Sakshi News home page

ముంబైని ఓడించ‌డం అంత ఈజీ కాదు.. టాప్‌-2లో నిలుస్తుంది: హర్భజన్

May 2 2025 6:59 PM | Updated on May 2 2025 7:21 PM

Mumbai Indians Will Finish In Top Two: Harbhajan Singh

ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

ఈ విజ‌యంతో ముంబై పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో ముంబై ఇండియ‌న్స్‌పై భార‌త మాజీ స్పిన్న‌ర్ హర్భజన్ సింగ్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.  ఈ ఏడాది సీజ‌న్ గ్రూపు స్టేజి పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై మొదటి రెండు స్థానాల్లో నిలుస్తుందని జోస్యం చెప్పాడు.

"రాజ‌స్తాన్ రాయల్స్‌పై ముంబై ఇండియ‌న్స్ పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. ప్ర‌స్తుతం ముంబై ఛాంపియ‌న్ టీమ్‌లా ఆడుతోంది. ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ప‌ది మంది ఆట‌గాళ్ల‌కు ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే స‌త్తా ఉంది. 

ఏ జ‌ట్టుకైనా హార్దిక్ సేన‌ను ఓడించ‌డం అంత సులువు కాదు. క‌చ్చితంగా గ్రూపు స్టేజిలో ముంబై టాప్‌-2లో నిలుస్తుంద‌ని నేను భావిస్తున్నాను. ముంబై గ్రూపు స్టేజిని 18 లేదా 20 పాయింట్ల‌తో ముగుస్తుంద‌ని" హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement