
లోటు వర్షపాతమే..!
జిల్లాలోని 23 మండలాల్లో ఇదే పరిసి్థతి
మండలాలవారీగా నమోదైన వర్షపాతం
మండలం మిల్లి.మీటర్లలో
దుబ్బాకలో 36.7
సిద్దిపేట రూరల్
మండలంలో 86.7
చిన్నకోడూరులో 92.0
బెజ్జంకిలో 53.3
కోహెడలో 64.3
హుస్నాబాద్లో 87.3
అక్కన్నపేటలో 68.6
నంగునూర్లో 36.6
సిద్దిపేట అర్భన్లో 66.9
తొగుటలో 78.6
మిరుదొడ్డిలో 93.5
దౌల్తాబాద్లో 46.2
రాయపోల్లో 82.8
వర్గల్లో 55.1
ములుగులో 48.4
మర్కూక్లో 22.9
జగదేవ్పూర్లో 40.8
గజ్వేల్లో 69.1
కొండపాకలో 45.8
చేర్యాలలో 65.9
మద్దూర్లో 32.4
అక్భర్పేట–భూంపల్లిలో 56.6
కుకునూర్పల్లిలో 54.0
జగదేవ్పూర్ మండలం తిగుల్లో మొలకెత్తని పత్తి
గజ్వేల్: సిద్దిపేట జిల్లాలో వర్షపాతం తీరు రైతులను కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు సమృద్ధిగా వర్షాలు కురవకపోగా, 23 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు పత్తిని విత్తుకోగా, వర్షాల జాడ కరువై అది మొలకెత్తక ఇప్పటికే భారీ నష్టం చోటుచేసుకున్నది. మిగితా పంటల సాగుపై ఆందోళన నెలకొన్నది. జిల్లాలో జూన్కు సంబంధించి ఇప్పటివరకు 75.7మి.మీటర్ల సాధారణ వర్షపాతం కావాల్సి ఉన్నది. కానీ అడపాదడపా 37.5మి.మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. కొమురవెళ్లిలో ఇప్పటివరకు 79.9మి.మీలు, నారాయణరావుపేట మండలంలో 89.6మి.మీల సాధారణ వర్షపాతం నమోదైంది. దూల్మిట్ట మండలంలో 120.7మి.మీల వ ర్షపాతం నమోదైంది. దీనిప్రకారం ఆ ఒక్క మండ లంలో 45.4మి.మీల అధిక వర్షపాతం నమోదైంది.
మొదలైన కలవరం
జిల్లాలో ఈసారి 5.50లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ప్రధానంగా వరి అత్యధికంగా 3లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తున్నారు. కానీ జూన్లో సమృద్ధిగా వర్షాల్లేక పోవడం, 23 మండలాల్లో మైనస్ వర్షపాతం ఉండటం వల్ల రైతుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో ఇప్పటికే పత్తి 60వేల ఎకరాలకుపైగా సాగులోకి వచ్చింది. గత నెలలో కురిసిన వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. కానీ అప్పటి నుంచి భారీ వర్షాల జాడలేక...పత్తి విత్తు మొలకెత్తని పరిస్థితి నెలకొన్నది. దీనివల్ల ఇప్పటికే పత్తికి భారీ నష్టం జరిగిపోయింది. ఇకపోతే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమే కాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నది. ఈ నెలాఖరులో లేదా జూలైనైనా భారీ వర్షాలు కురిస్తే రైతులకు కొంత ఊరట లభించే అవకాశమున్నది.
జూన్లో సాధారణ వర్షపాతం 75.7మి.మీ ఇప్పటివరకు కురిసింది...37.5మి.మీటర్లు మాత్రమే పత్తికి ఇప్పటికే భారీ నష్టం..ఆందోళనలో అన్నదాత
ఆందోళన వద్దు
జిల్లాలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పంటల సాగుకు అదును దాటలేదు. భారీ వర్షాలు వస్తాయని ఆశాభావం ఉన్నది. జూలై 15 వరకు పంటల సాగుకు అవకాశమున్నది.
: రాధిక, వ్యవసాయాధికారి

లోటు వర్షపాతమే..!