
హై టెన్షన్!
దుబ్బాకలో
తీవ్ర ఉద్రిక్తత మధ్య మంత్రి వివేక్ పర్యటన
దుబ్బాకలో జరిగిన మంత్రి సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట
దుబ్బాక పట్టణంలో శుక్రవారం హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పర్యటనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఉద్రిక్తత నెలకొంది. ఇరు పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో వారిని అదుపుచేసేందుకు పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్రెడ్డిలు వారివారి పార్టీల కార్యకర్తలకు ఎంత నచ్చజెప్పినా ఫలితం కానరాలేదు. కలెక్టర్ సైతం పదేపదే విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
అభివృద్ధికి అడ్డుపడొద్దు: మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఇది చూసి ఓర్వలేకనే కొన్ని శక్తులు అడ్డుతగిలే ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి వివేక్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అప్పులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాకు 12 వేల ఇళ్లు మంజూరు చేశామన్నారు.
అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యప్రొటోకాల్, ఫ్లెక్సీల రగడ ఇరు పార్టీ నేతల మధ్య తోపులాట మంత్రి సమావేశం రసాభాస

హై టెన్షన్!