
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఎన్సాన్పల్లిలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 25లోగా పాఠశాలలో బోనఫైడ్, 2పాస్పోర్ట్ సైజు ఫొటోలు, ఆధార్కార్డు జిరాక్స్లను జతపరిచి దరఖాస్తు చేయాలన్నారు. ఈ నెల 27న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రవేశ పరీక్షను గురుకుల పాఠశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 91217 74930 నంబర్లో సంప్రదించాలన్నారు.
దోస్త్ మూడోవిడత పొడిగింపు
సిద్దిపేటఎడ్యుకేషన్: దోస్త్ మూడో విడత ప్రవేశాల ప్రక్రియను ఈనెల 25 వరకు పొడిగించినట్లు దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆయన మాట్లాడారు. మూడో విడతలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 28న సీట్లను కేటాయిస్తారని, 30వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో టెక్నికల్ సమస్యలు ఉత్పన్నం అయితే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఏర్పాటు చేసిన దోస్త్ హెల్ప్లైన్ సెంటర్లో సంప్రదించాలని సూచించారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
సిద్దిపేటకమాన్: పట్టణంలోని 37వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల కల సాకారం అయ్యిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
23న మెగా జాబ్మేళా
వర్గల్(గజ్వేల్): వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో మ్యాజిక్బస్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో 23న విద్యార్థినులకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. యాక్సిస్ బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, జస్ట్డయల్, కార్పోన్, హెచ్ఆర్హెచ్ నెక్స్ట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని, డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన ఇతర కళాశాలల విద్యార్థినులు కూడా హాజరుకావొచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ప్రియాంక: 81217 43274, పూర్ణశ్రీ: 80740 17090(మ్యాజిక్ బస్), డాక్టర్ వి.రాధ: 81791 23444, డాక్టర్ ఎస్.రాధారాణి: 99122 35358 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.