
మెడికల్ కౌన్సిల్ తనిఖీలు
సిద్దిపేటకమాన్: పట్టణంలో నలుగురు నకిలీ వైద్యులను గుర్తించినట్లు మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ జి. శ్రీనివాస్, సిద్దిపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్ తెలిపారు. సిద్దిపేటలోని పలు ఆస్పత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ సిద్దిపేటలో 20 ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టణంలోని నాలుగు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్నారన్నారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. త్వరలో వీరిపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం నుంచి అనుమతులు తీసుకున్న ఆస్పత్రులలో అర్హత కలిగిన వైద్యులు మాత్రమే వైద్య సేవలు అందించాలని తెలిపారు. సమావేశంలో ఐఏంఏ అధ్యక్షుడు డాక్టర్ చందర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ గణేష్ వెనిశెట్టి, ట్రెజరర్ డాక్టర్ ప్రణీత్, డాక్టర్ సముద్రాల శ్రీనివాస్, డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రవణ్, డాక్టర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.
నలుగురు నకిలీ వైద్యుల గుర్తింపు