
అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం
సిద్దిపేటజోన్: ‘ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరం ప్రక్రియ. అర్హులైన వారందరికీ ఇళ్లు అందిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి జిల్లాకు ఎక్కువగా వచ్చేలా చూస్తా’నని మంత్రి గడ్డం వివేక్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నియోజకవర్గ పరిధిలోని 2,840 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 8 లక్షల కోట్లు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను ఆపడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వేదిక మీదకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఆహ్వానించక పోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రి వేదిక మీదకు రావడం, బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులను పైకి పిలవడంతో శాంతించారు. ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అందోళన వద్దు.. ఇది నిరంతరం ప్రక్రియ మరిన్ని ఇళ్ల మంజూరుకు కృషి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్