
10 రోజుల్లో ఇళ్ల గ్రౌండింగ్
● ఉచిత ఇసుకకు తహసీల్దార్ల వద్దటోకెన్లు తీసుకోండి ● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం
సిద్దిపేటరూరల్: మంజూరు పత్రాలు పొందినవారితో 10 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గృహనిర్మాణ శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్థిక స్థోమత లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే నోట్ చేసుకోవాలని, ఎంపీడీఓతో సమావేశం నిర్వహించి సుముఖంగా లేని వారికి ఇందిరమ్మ కమిటీ, అధికారుల సమక్షంలో లెటర్ రాసి వారితో ఇల్లు వద్దు అన్నట్లు సంతకం తీసుకోవాలని చెప్పారు. రెండో విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు సోమవారం నుంచి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. ఉచిత ఇసుకకు సంబంధించి ఆయా మండలాల తహసీల్దార్లు టోకెన్లు అందజేస్తారన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, నిర్మాణంలో ఇబ్బందులు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా హౌసింగ్ పీడీ దామోదర్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఈఈ, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మాలనపై వారం రోజు ల పాటు ప్రణాళిక ప్రకారంగా యువతకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ –2025 కార్యాచరణపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉన్నత పాఠశాల స్థాయి నుంచి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడికల్ తదితర విద్యాసంస్థలపై ఫోకస్ పెడుతూ ఈనెల 26వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, మాదక ద్రవ్యాల పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఇంటర్మీడియెట్ అధికారి శ్రీనివాస్రెడ్డి, డీపీఆర్ఓ రవికుమార్ పాల్గొన్నారు.
డయేరియా వ్యాధిపై అప్రమత్తం
డయేరియా వ్యాధి ప్రబలకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అదేశించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తాగునీరు, కలుషితం, అపరిశుభ్ర వాతావరణం వల్ల డయేరియా, ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నా రు. ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా డయేరియాపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు,, హాస్టళ్లు, విద్యార్థులకు వేడి నీ రు అందించాలన్నారు. అన్ని విద్యాలయాల్లో ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు , ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయా రు చేసే విధానం గూర్చి వివరించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్, డిడబ్ల్యూఓ లక్ష్మికాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.