
నాచగిరి వ్రత శోభితం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవునివ్రత శోభతో అలరారింది. క్షేత్రానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో పుణ్యస్నానాలాచరించి భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాలు, అభిషేకాలు, కల్యాణాలు, సేవలు జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో కొలువైన శ్రీలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా సీనియర్ అసిస్టెంట్ సుధాకర్గౌడ్ పరివారం తగు జాగ్రత్తలు తీసుకున్నారు.

నాచగిరి వ్రత శోభితం