ఫల క్షేత్రం.. రైతుకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

Jun 22 2025 7:21 AM | Updated on Jun 22 2025 7:21 AM

ఫల క్

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

ఫల వృక్షాల పరిశోధనకు, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా ఉద్యాన వికాసానికి సిద్దిపేట జిల్లా ములుగు ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ప్రూట్స్‌’ బాటలు వేస్తోంది. ఇక్కడ 53 ఎకరాల్లో ఆధునిక సాగు పద్ధతులు నిరంతర శాస్త్రవేత్తల పరిశోధనలు ఉద్యాన అధికారుల పర్యవేక్షణలో ఫలజాతి తదితర మొక్కల నర్సరీతో భాసిల్లుతున్నది. వృద్ధి చేస్తున్న మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి రకాల మొక్కలకు డిమాండ్‌ ఉన్నది. సాగు రకాలు, దిగుబడి తదితర వివరాలను సీఓఈ అధికారి ఆశీష్‌ వివరించారు.

ఉద్యాన వికాసానికి బాటలు వేస్తున్న

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ ప్రూట్స్‌’

కొబ్బరి కోనసీమను మరిపించేలా

కొబ్బరి తోటలు కోనసీమలో సాగు చేస్తుంటారు. తెలంగాణలో సైతం వీటిని ప్రోత్సహించేలా ములుగు సీఓఈలో చౌగాట్‌ ఆరేంజ్‌ ద్వార్ప్‌ పొట్టి రకాలు, ఎల్లో పొట్టి కొబ్బరి రకాలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఎకరానికి 100 మొక్కలు నాటుకోవచ్చు. వర్షాకాలంలో నాటడంతో పాటు ఏ నేలలైనా అనుకూలం. ఒక చెట్టుకు 150 వరకు కాయల దిగుబడి వస్తుంది. నీరు తప్పని సరిగా ఉండాలి.

నర్సరీల్లో పలు ఫలజాతి మొక్కలు

అవసరమైన రైతులకు పంపిణీ

నేలల అనుకూలతను బట్టి

నాటుకోవచ్చు

పోషకాల జామ

గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా లభించే పోషక ఫలం. ఇందులో అలహాబాద్‌ సఫేదా, లక్నో 49 రకాలున్నాయి. ఎప్పుడైనా నాటుకోవచ్చు. ఎకరంలో 250 మొక్కలు నాటవచ్చు. సంవత్సరానికి 15 నుంచి 20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.

నిమ్మ.. ఔషధ గని

ప్రతి నిత్యం ఆహార పదార్థాల్లో వినియోగించుకునే ఫలం. ఇందులో పెట్లూరి సెలక్షన్‌–1, బాలాజీ నిమ్మజాతి రకాలున్నాయి. ఏప్రిల్‌, మేలో కాకుండా ఎప్పుడైనా నాటుకోవచ్చు. నీరు ఆగని నేలల్లో నాటుకోవాలి. ఎకరానికి 111 మొక్కలు వేసుకోవాలి. ఒక చెట్టుకు 700 నుంచి 750 కిలోల దిగుబడి వస్తుంది. గజ్జి తెగులు సోకుతుంది, నివారణకు చర్యలుంటాయి.

కేఎన్‌ఎం 1638 వరి (సన్నరకం)

పంట కాలం: వానాకాలంలో 120 నుంచి 125 రోజులు, యాసంగిలో 130 నుంచి 135 రోజులు

దిగుబడి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్లు

ప్రత్యేకతలు : ఉల్లికోడు బయోటైప్‌ 3, అగ్గి తెగులును సమర్థవంతంగా తట్టుకుంటుంది. అన్నం రుచిగా, నాణ్యతగా ఉంటుంది.

తునికి కేవీకేలో ఈ యాసంగి సీజన్‌లో సన్నరకం ఈ రకం విత్తనాన్ని సాగు చేశారు. 200 బస్తాల విత్తనాలను రైతులకు విక్రయించారు.

కూనారం సన్నలు

(కేఎన్‌ఎం118) దొడ్డు రకం

వానాకాలం, యాసంగి సీజన్‌కు అనుకూలం

పంటకాలం: వానాకాలం 118 నుంచి 120 రోజులు

యాసంగి 120 నుంచి 125 రోజులు

దిగుబడి ఎకరాకు 28 నుంచి 32 క్వింటాళ్లు

ప్రత్యేకతలు: అగ్గితెగులు, మెడ విరుపు కొంతవరకు తట్టుకుంటుంది. పంట నేలపై పడిపోదు.

ఆర్‌ఎన్‌ఆర్‌ 28361

రాజేంద్రనగర్‌ ఆర్‌ఎన్‌ఆర్‌

28361 దొడ్డు రకం వరి విత్తనం

వానాకాలంలో సాగుకు అనుకూలం

పంట కాలం: 130 రోజులు, మధ్యకాలిక రకం,

దిగుబడి ఎకరాకు 30 నుంచి 32 క్వింటాళ్లు

ప్రత్యేకతలు: సుడిదోమ, మెడ విరుపు తెగులు, బ్యాక్టీరియా ఎండుటాకు తెగులు, పొట్ట కుళ్లు తెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. విత్తన నిద్రావస్థ మూడు వారాలు ఉంటుంది.

తెలంగాణ సోన,

ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 సన్న రకం

పంట కాలం: వానాకాలం 125 రోజులు, యాసంగి 135 రోజులు

దిగుబడి ఎకరాకు 26 నుంచి 28 క్వింటాళ్లు

ప్రత్యేకతలు: అగ్గి తెగులు తట్టుకుంటుంది. పొట్టకుళ్లు తెగులు కొంతవరకు తట్టుకుంటుంది. నత్రజని ఎక్కువగా వినియోగించవద్దు. ఈ సన్న రకం వరిని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు.

ఫలరాజు.. మామిడి

ఫలరాజుగా మామిడి ప్రసిద్ధి గాంచింది. కేసరి, హిమాయత్‌, దసేరి, బంగినపల్లి మామిడి మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. ఎర్ర నేల, నీరు నిల్వని నేలలు సాగుకు అనుకూలం. ఎకరంలో 160 మొక్కలు నాటవచ్చు. మూడేళ్ల తరువాత కోత మొదలవుతుంది. కేసరి రకం ఎకరానికి 8 నుంచి 9 టన్నులు, హిమాయత్‌ 4 నుంచి 5 టన్నులు, దసేరి 6 నుంచి 8 టన్నులు, బంగినపల్లి 6 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తుంది.

– కె. కృపాకర్‌ రెడ్డి, ములుగు(గజ్వేల్‌):

అందుబాటులో మొక్కలు

వివిధ రకాల ఉద్యాన మొక్కలను సీఓఈ ద్వారా పెంచుతున్నాం. వీటిని అవసరమైన రైతులకు అందజేస్తున్నాం. మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి మొక్కలు ఉన్నాయి. రైతులు ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ నుంచి సహకారం కోసం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 89777 14250 లేదా ఉద్యానశాఖ అధికారి 90001 36490 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

– ఆశీష్‌, ఉద్యాన శాఖ అధికారి

పంపిణీకి సిద్ధంగా ఉన్న మామిడి మొక్కలు

విత్తన శుద్ధి తప్పనిసరి

రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు నాణ్యమైన విత్తనాలు, తెగులు, చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. వానాకాలం, యాసంగి సీజన్‌కు తగినట్లుగా నీటి ఎద్దడి, ఎండ తీవ్రతను తట్టుకునే రకాలను ఎంచుకోవడం మంచిది. సాగులో సమస్యలుంటే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలతో ఎరువులు, విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పని సరిగా చేయాలి. మోతాదుకు మంచి ఎరువులు, పురుగుల మందులు వాడొద్దు.

– ప్రతాప్‌రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త, తునికి

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం1
1/4

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం2
2/4

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం3
3/4

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం4
4/4

ఫల క్షేత్రం.. రైతుకు ఊతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement