
నా భూమిలో సబ్స్టేషన్ నిర్మించొద్దు
చిలప్చెడ్(నర్సాపూర్): మండల పరిధిలోని చండూర్ శివారులో గల సర్వే నం.2లో సబ్స్టేషన్ నిర్మాణం కోసం విద్యుత్ శాఖ అధికారులు ముగ్గు పోసిన విషయం విధితమే. కాగా ఆ భూమి తనదని, ఎన్నో ఏళ్లుగా తన పేరు మీదే ఉందని గ్రామానికి చెందిన పుల్కంటి లాజర్ పేర్కొన్నాడు. శనివారం లాజర్ అధికారులు పోసిన ముగ్గును దున్నేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నం.2లో గల లావుణి పట్టా ఎకరన్నర భూమి తన పేరు మీదే ఉందని, దానికి సంబంధించిన పట్టాబుక్కులు సైతం ఉన్నాయన్నారు. అధికారులు సబ్స్టేషన్ నిర్మాణానికి ముగ్గు పోయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆ భూమిలో నిర్మాణం చేపడితే, బదులుగా మరో చోట భూమి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సర్వే నం.2లో చాలావరకు లావుణి పట్టాలు ఉన్నాయని, వారందరివి కాదని, తన భూమిలోనే ముగ్గు పోయడం సరైంది కాదన్నారు. ఈ విషయమై రెవెన్యూ కార్యాలయంలో సైతం వినతిపత్రం ఇచ్చానన్నారు. ఆ భూమి విషయంలో నాకు అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానన్నారు.
లేదంటే ఆత్మహత్య చేసుకుంటా
భూ బాధితుడు లాజర్