
నిత్యం భర్త గొడవ పడుతున్నాడని..
జిన్నారం (పటాన్చెరు): భర్త తరచూ తనతో గొడవ పడుతున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ రెడ్డి వివరాల ప్రకారం... బీహార్కు చెందిన సద్దాం అంసారి, భార్య అమన్ ఖాతూన్ ముగ్గురు పిల్లలతో కలిసి గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్లో నివాసముంటున్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం కూడా మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన కాటున్ (24) భర్త, ముగ్గురి పిల్లలు ఇంట్లో ఉండగా బయటి నుంచి తలుపులు పెట్టింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొద్ది దూరంలో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో చున్నీతో ఉరివేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చెట్టుకు ఉరి వేసుకుని..
పటాన్చెరు టౌన్: వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం నందిగామ గ్రామానికి చెందిన మల్లేశం(41) మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో 19వ తేదీన ఇంట్లో గొడవ పడి, 20వ తేదీన పనికి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు మల్లేశం కోసం వెతుకుతుండగా ఇస్నాపూర్ శివారులోని సూర్యవంశం వెంచర్లో చెట్టుకి ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పురుగుల మందు తాగి యువకుడు..
మద్దూరు(హుస్నాబాద్): పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చేర్యాల మండలంలోని అర్జున్పట్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తాళ్లపల్లి శ్రీకాంత్(26) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఈనెల 19న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
భార్య ఆత్మహత్య

నిత్యం భర్త గొడవ పడుతున్నాడని..