
ఇంటర్ విద్యార్థి అదృశ్యం
నర్సాపూర్ రూరల్: ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. ఈ ఘటన నర్సాపూర్ పట్ట ణంలో జరిగింది. ఎస్సై లింగం కథనం మేరకు... పట్టణంలోని కాజీగల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ.జావిద్ అలీ రెండో కూతురు ఫరియా సుల్తానా (19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనెల 19న వేకువ జాము నుంచి కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలతో పాటు స్నేహితులు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియలేదు. శనివారం జావిద్ అలీ ఖాజీగల్లీకి చెందిన ఎండీ ఫయాజ్ తన కూతురిని కిడ్నాప్ చేశాడని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.