
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా వేడుకలు
హాజరైన ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి జోన్: అంతర్జాతీయ యోగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోని శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ పరితోశ్ పంకజ్తోపాటు ఇషా ఫౌండేషన్ ప్రతినిధి సుమిట్ పాటిల్, డా.మోహిని హాజరయ్యారు. యోగాసనాలు ధ్యానం, శ్వాసపై ధ్యాస, సూర్యనమస్కారాలు, ప్రాణాయానంతోపాటు వివిధ రకాల ఆసనాలు వేయించారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే వారోత్సవాలను ఎస్పీ ప్రారంభించారు. ‘ఐయామ్ యాంటీ డ్రగ్ సోల్జర్’పేరుతో కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
27న పుణ్యక్షేత్రాలకు
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నారాయణఖేడ్: రాష్ట్రంలోని 10 పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకుని వచ్చేలా ఈనెల 27న ఖేడ్ నుంచి ప్రత్యేకంగా ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులను నడుపుతున్నట్లు ఖేడ్ ఆర్టీసీ డీఎం మల్లేశయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బస్సులు 27న ఉదయం 8 గంటలకు ఖేడ్ నుంచి బయల్దేరి 36 గంటలపాటు ప్రయాణించి 10 పుణ్యక్షేత్రాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామగుండం, మిడ్ మానేరు డ్యాం, వరంగల్, సిద్దిపేట, మెదక్, ఏడుపాయలను దర్శించుకుని 28న సాయంత్రం తిరిగి ఖేడ్కు చేరుకుంటాయని తెలిపారు. ఒకొక్కరికి ఎక్స్ప్రెస్ బస్సుకు రూ.1,400, డీలక్స్ బస్సుకు రూ.1,600 చార్జీ ఉంటుందన్నారు. పూర్తివివరాలు, టికెట్ బుకింగ్ కోసం 9959223170, 9441071134, 9676667703 నంబర్లలో సంప్రదించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వ్యాధినిరోధక
టీకాలు వేయించాలి
జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి
కొండాపూర్(సంగారెడ్డి): ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి సూచించారు. మండల పరిధిలోని గారకుర్తిలో శనివారం టీకాలు వేసే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో, ధనుర్వాతం, అమ్మవారు, తట్టు వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. ఇప్పటివరకు చిన్నారులకు టీకాలు వేయించని చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పాటు టీకాలు వేసుకోకుంటే జరిగే ప్రమాదాలను కూడా వివరించాలని సూచించారు. ప్రతి చిన్నారికి టీకాలు వేయించే బాధ్యత ఆశావర్కర్లదేనన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి రసజ్ఞ, ఏఎన్ఎం శివలత తదితరులు పాల్గొన్నారు.
చలో కలెక్టరేట్ను
జయప్రదం చేయండి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నీరుడు సాయిలు, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ పిలుపునిచ్చారు. రామచంద్రాపురం పట్టణంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే స్వీపర్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి గుర్తింపు కార్డులతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలని కోరారు.

పోలీస్ పరేడ్ గ్రౌండ్లో యోగా వేడుకలు