
భూ నిర్వాసితులకు మూడో విడత పరిహారం
సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఆదివారం మూడో విడతగా చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కలెక్టర్, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 70 మందికి పరిహారం చెక్కులు అందించినట్లు భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ రాధాబాయి తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ తహసీల్దార్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా