సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మె ల్యే రాజేందర్రెడ్డిల విమర్శలు అర్థరహితమని బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవనంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి విమర్శలు చేస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాయకులు ముద్దం అనిల్గౌడ్, కాసర్ల శ్రీనివాస్, ఎస్కే అఫ్రోజ్, ఎండీ ఆర్జు, అనిల్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.