మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్‌’ ప్రయోగం | Minister Atchannaidu Red Book Experiment On Officials | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్న ‘రెడ్‌బుక్‌’ ప్రయోగం

Aug 19 2025 3:19 PM | Updated on Aug 19 2025 4:41 PM

Minister Atchannaidu Red Book Experiment On Officials

సాక్షి, విజయవాడ: అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు రెడ్‌బుక్ ప్రయోగించారు. అచ్చెన్నాయుడు వేధింపులకు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్‌ సెలవుపై వెళ్లిపోయారు. సీఎస్‌కు లేఖ రాసి ఆయన సెలవుపై వెళ్లిపోయారు. అవినీతి వ్యవహారాల కోసం జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు ఓఎస్‌డి ఒత్తిడి చేశారు. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తిత్వం చేయాలని జీఎంపై మంత్రి అచ్చెన్నాయుడు పేషీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

దీంతో చెప్పిన మాట విననందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆయనను నెల్లూరుకి బదిలీ చేశారు. సెలవుపై వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని సీస్‌కు ఆగ్రోస్ జీఎం లేఖ రాశారు. జీఎం రాజమోహన్‌ని వేధించేందుకే బదిలీ చేశారని సమాచారం. రాజమోహన్ స్థానంలో అర్హత లేని జూనియర్‌కి జీఎంగా మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతలను అప్పగించారు.

అచ్చెన్నాయుడు వేధింపులకు సెలవుపై వెళ్లిన ఆగ్రోస్ జీఎం రాజామోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement