జైలు నుంచే పాలన.. వారానికి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ సమీక్ష | Delhi CM Arvind Kejriwal To Meet 2 Ministers In A Week | Sakshi
Sakshi News home page

జైలు నుంచే పాలన.. వారానికి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ సమీక్ష

Apr 16 2024 10:15 AM | Updated on Apr 16 2024 10:27 AM

Delhi CM Arvind Kejriwal To Meet Two Ministers in a Week - Sakshi

ఢిల్లీ: మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'సందీప్ పాఠక్' రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి ప్రతి వారం ఇద్దరు మంత్రులను జైలుకు పిలుస్తారని.. అక్కడే వారి శాఖల పనిని సమీక్షించి వారికి మార్గదర్శకాలు, ఆదేశాలు ఇస్తారని పాఠక్ చెప్పారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిని వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతించిన సందర్శకుల జాబితాలో మంత్రులు అతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్‌ ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారని పాఠక్ చెప్పారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎమ్మెల్యేలు మునుపటి కంటే రెట్టింపు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు.. పాఠక్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement