‘సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే.. బాబుపై కేసు నమోదు చేస్తారా?’ | CPI K Ramakrishna Takes On AP Govt | Sakshi
Sakshi News home page

‘సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం జరిగితే.. బాబుపై కేసు నమోదు చేస్తారా?’

Jun 23 2025 3:15 PM | Updated on Jun 23 2025 5:12 PM

CPI K Ramakrishna Takes On AP Govt

అనంతపురం:  ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.  అధికార పార్టీకి పోలీసులు ఊడిగం చేయడం బాధాకరమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అసలు వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు చేయడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్‌లో ప్రమాదం .జరిగితే.. చంద్రబాబుపై కేసు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు రామకృష్ణ. 

ఇక డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అంటున్న చంద్రబాబు.. కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేకపోతున్నారని నిలదీశారు. ఓ వైపు అప్పులు చేస్తూనే మరో వైపు సంక్షేమ పథకాలకు డబ్బు లేదంటున్నారని చంద్రబాబు పాలనా తీరుపై మండిపడ్డారు రామకృష్ణ.. 

చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రం.. సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement