ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్‌ సిద్ధం: చెవిరెడ్డి | Chevireddy Bhaskar Reddy Speech In Medarametla Siddham Sabha | Sakshi
Sakshi News home page

ఎన్ని పార్టీలు ఏకమైనా యుద్ధానికి సీఎం జగన్‌ సిద్ధం: చెవిరెడ్డి

Mar 10 2024 4:43 PM | Updated on Mar 10 2024 5:11 PM

chevireddy bhaskar reddy speech in Medarametla siddham sabha - Sakshi

సాక్షి, బాపట్ల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ రైతులు గురించే ఆలోచించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అ‍న్నారు. అద్దంకి మేదరమెట్లలో ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో చెవిరెడ్డి ప్రసంగించారు.

‘సీఎం జగన్‌ ప్రతి ఊర్లో రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. మహిళలు, విద్యార్థులకు ఎంతో చేశారు. ఒకటో తేదీనే రూ.3 వేల పెన్షన్ అందిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా యుద్ధానికి జగన్ సిద్ధం. సంక్షేమానికి సీఎం జగన్ సిద్ధం అంటున్నారు’ అని చెవిరెడ్డి తెలిపారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement