చిత్రంలో కనిపిస్తున్నది రేగిడి తహసీల్దార్ కార్యాలయ నూతన
భవనం. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.90లక్షల ఆర్
అండ్ బీ నిధులతో నిర్మాణం చేపట్టింది. అన్ని హంగులతో భవనం సిద్ధంగా ఉన్నా ప్రస్తుత ప్రభుత్వం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. శిథిల భవనాల్లో విధుల నిర్వహణకు అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించి నూతన భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని రెవెన్యూ
సిబ్బందితో పాటు ప్రజలు కోరుతున్నారు. – రేగిడి


