ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి

బొబ్బిలి రూరల్‌: మండలంలోని ముత్తాయివలస గ్రామ శివారు ప్రాంతంలో తిష్ఠవేసిన అడవి ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్‌ పిల్లా వసుంధర, అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఏనుగుల సంచార ప్రాంతానికి చేరుకుని ఏనుగుల దాడినుంచి తప్పించుకునే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశువులను, మేకలను ఏనుగులున్న ప్రాంతాలవైపు తరలిపోకుండా చూసుకోవాలని,నిత్యం అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు.అటవీశాఖ అధికార సిబ్బంది ఎప్పకప్పుడు సమాచారం అందిస్తారని అందుకు అనుగుణంగా మెలగాలని సూచించారు. వాటికి హానికలిగించే చర్యలు చేపట్టవద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement