
ఏనుగుల సంచారంతో అప్రమత్తంగా ఉండాలి
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస గ్రామ శివారు ప్రాంతంలో తిష్ఠవేసిన అడవి ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ పిల్లా వసుంధర, అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఏనుగుల సంచార ప్రాంతానికి చేరుకుని ఏనుగుల దాడినుంచి తప్పించుకునే అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పశువులను, మేకలను ఏనుగులున్న ప్రాంతాలవైపు తరలిపోకుండా చూసుకోవాలని,నిత్యం అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు వివరించారు.అటవీశాఖ అధికార సిబ్బంది ఎప్పకప్పుడు సమాచారం అందిస్తారని అందుకు అనుగుణంగా మెలగాలని సూచించారు. వాటికి హానికలిగించే చర్యలు చేపట్టవద్దని, ఆందోళన చెందవద్దని సూచించారు.