పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు

Jun 17 2025 5:26 AM | Updated on Jun 17 2025 5:26 AM

పీజీఆ

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహి ంచిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 118 వినతులు అందాయి. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిద శాఖలకు చెందిన అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌కు 24 ఫిర్యాదులు

పార్వతీపురం రూరల్‌: ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురానా అన్నారు. ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు శాఖ కార్యాలయంలో ఆమె ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఇచ్చిన 24 ఫిర్యాదులను నేరుగా ఆమె స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌స్టేషన్లకు ఫోన్‌ ద్వారా వివరాలను తెలియజేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పూర్వాపరాలపై విచారణ చేసి చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే ఆ నివేదికను జిల్లా ఎస్పీ కార్యాలయానికి విధిగా పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదామ్‌ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఐటీడీఏ గ్రీవెన్స్‌ సెల్‌కు 60 అర్జీలు

సీతంపేట: ఐటీడీఏలోని శంకరన్‌ సమావేశ మందిరంలో సోమవారం పరిపాలనాధికారి వి.సునీల్‌ ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 60 మంది గిరిజనులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్‌ డీఈ సింహాచలం, జీసీసీ మేనేజర్‌ నరసింహులు, ఏఈ నీలిమ,హెచ్‌వో జయశ్రీ, ఏఎంవో కోటిబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ ఎన్‌.జాకాబ్‌దయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు1
1/2

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు2
2/2

పీజీఆర్‌ఎస్‌కు 118 వినతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement