
విత్తనాల వ్యాన్ బోల్తా..
రేగిడి: పాలకొండ మండలం తుమరాడ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్యాన్పై సంపత్ అనే వరి రకం విత్తనాలను తీసుకువస్తున్నారు. అయితే వ్యాన్ ఉంగరాడమెట్ట వద్దకు వచ్చేసరికి ఆదివారం వేకువజామున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఇదిలా ఉంటే రైతుసేవా కేంద్రాల్లో విత్తనాలు అందక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విత్తనాలు దొరక్కపోవడం వల్లే ఇతర జిల్లాల నుంచి విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9 మద్యం సీసాలు స్వాధీనం
పూసపాటిరేగ: మండలంలోని చోడమ్మ అగ్రహారంలో అనధికారికంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు భోగాపురం ఎకై ్సజ్ సీఐ వి.రవికుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిందితుడి నుంచి మొత్తం 9 మద్యంసీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఎక్కడైనా ఎవరైనా అనుమతులు లేకుండా మద్యం తరలించినా, విక్రయించినా, మద్యం బెల్టుషాపులు నడుపుతున్నా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

విత్తనాల వ్యాన్ బోల్తా..