నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు తప్పనిసరి

Jun 16 2025 6:57 AM | Updated on Jun 16 2025 6:57 AM

నిబంధనలు తప్పనిసరి

నిబంధనలు తప్పనిసరి

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో ఎవరైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాల్సి వస్తే నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తులు వారం రోజుల ముందే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తెలియజేసి సబ్‌డివిజనల్‌ అధికారుల నుంచి అనుమతి పొందాలన్నారు. అదేవిధంగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు వారి మొత్తం వివరాలు వెల్లడిస్తూ ఎందుకు నిర్వహిస్తున్నారో? ఎంతమంది వస్తున్నారో? అన్న వివరాలతో పాటు ప్రారంభ, ముగింపు సమయం, సభా స్థలం, రూట్‌ మ్యాప్‌ వివరాలు కూడా తెలియజేయాలని చెప్పారు. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement