రాష్ట్రంలో హిట్లర్‌, ముస్సోలిని పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో హిట్లర్‌, ముస్సోలిని పాలన

Jun 14 2025 9:54 AM | Updated on Jun 14 2025 9:54 AM

రాష్ట్రంలో హిట్లర్‌, ముస్సోలిని పాలన

రాష్ట్రంలో హిట్లర్‌, ముస్సోలిని పాలన

● అందరికీ తల్లికి వందనం అని చెప్పి అన్ని నిబంధనలేమిటి? ● ఏం సాధించారని ఏడాది సుపరిపాలన సంబరాలు.. ● మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు రాజన్నదొర

సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు:

రాష్ట్రంలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం స్థానంలో రెడ్‌బుక్‌ పాలన సాగుతోందని.. హిట్లర్‌, ముస్సోలిని వంటి నియంతలను చంద్రబాబు, లోకేశ్‌లు తలపిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్న దొర విమర్శించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలని దగా చేసి, అన్ని వర్గాలనూ మోసగించి.. ఏడాది కాలంలో ఏం సాధించారని సుపరిపాలన సంబరాలు చేసుకుంటున్నారని కూటమి నాయకులకు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు. నిజంగా వారు మంచి పరిపాలన అందిస్తే.. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజ లు ఎందుకు బ్రహ్మరథం పడతారని ప్రశ్నించారు. సాలూరులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇదేం సుపరిపాలన?

ఇది ఏ సుపరిపాలనో తనకై తే అర్థం కావడం లేదని రాజన్నదొర అన్నారు. ‘తల్లికి వందనం గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం ఇస్తున్నది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినది. దీపం–2 కింద ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ ఏడాది కాలంలో ఒక్కటే ఇచ్చారు. పింఛన్లు ఇవ్వడం వారి గొప్పా.. ఏ ప్రభుత్వం వచ్చినా కచ్చితంగా దానిని కొనసాగిస్తుంది. సూపర్‌ సిక్స్‌ కాకుండా.. గత ప్రభుత్వం అమలు చేసినవి, ఇతర పథకాలన్నీ కలిపి 150 వరకూ ఉంటాయి.. అవన్నీ ఎక్కడ? సంక్షేమ క్యాలెండర్‌ లేదు, జాబ్‌ క్యాలెండర్‌ లేదు.. గతంలో ఇచ్చిన పథకాలన్నీ నిలిపివేశారు. ఇదేనా, ఇలాగేనా సుపరిపాలన? అడిగితే అరెస్టులు, మాట్లాడితే కేసులు.. అంబేడ్కర్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. హిట్లర్‌, ముస్సోలిని పాలన సాగుతోంది..’ అని విమర్శించారు.

ఏడాదిలోనే పాలన తేలిపోయింది..

ఏడాది కాలంలోనే కూటమి పాలన తేలిపోయింద

ని రాజన్నదొర విమర్శించారు. వారిది నిజంగా సుపరిపాలన అయితే.. వారి భాషలో కనీసం ప్రతిపక్ష నేత కాని, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారని ప్రశ్నించారు. పొదిలిలో జన ప్రవాహం కనిపించిందని.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు ఇది అద్దం పడుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement