
సోమవారం సాలూరులో పీజీఆర్ఎస్
పార్వతీపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమ వారం సాలూరులో నిర్వహిస్తామని కలెక్ట ర్ ఎ.శ్యామ్ప్రసాద్ తెలిపారు. జిల్లా అధి కారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. సా లూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధికారులందరూ సాలూరులో నిర్వహించనున్న పీజీఆర్ఎస్లో పాల్గొనాలని కోరారు.
గిరిజన వర్సిటీ పనులు
వేగవంతం చేయండి
● ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక డిమాండ్
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ పనులను వేగవంతం చేయాల ని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. వర్సిటీ పనులను శుక్రవారం పరిశీలించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టీవీ కట్టిమణిని కలిసి నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ 2019లో స్థాపితమైన విశ్వవిద్యాలయ నిర్మాణం ఇప్పటి కీ పూర్తికాకపోవడం విచారకరమన్నారు. పను ల్లో ప్రభుత్వం అశ్రద్ధ చూపడం తగదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గిరిజన వర్సిటీది కీలకపాత్రగా అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కె.విజయగౌరి, నాయకులు వెంకటరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఆర్.జమ్ము క్లస్టర్లో
రూ.23 లక్షల అవినీతి
● దర్యాప్తునకు డిమాండ్ చేసిన
ఏపీ గిరిజన సంఘం నాయకులు
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని రాయగడ జమ్ము వెలుగు పథకం క్లస్టర్లో 2014 నుంచి 2020 వరకు సీసీగా పనిచేసిన గరుగుబిల్లి శ్రీనివాసరావు ఉన్నతి పథకం రుణాల పేరుతో రూ.23 లక్షలు అవినీతికి పాల్పడ్డారని ఏపీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మండంగి రమణ, మండంగి శ్రీనివాసరావు ఆరోపించా రు. అవినీతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురంలోని గిరిజన సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాయగడ జమ్ము క్లస్టర్లో రాయగడ జమ్ము, బాలేసు, చాపరాయి బిన్నిడి పంచాయతీలు (వీఓఏలు) ఉన్నాయి. ఈ మూడు వీఓఏల పరిధిలో సుమారు 14 మహిళా సంఘాల నుంచి ట్రైబల్ సబ్ప్లాన్ నిధులు ఉన్నతి పథకం కింద గిరిజనులకు అప్పులు ఇస్తామని చెప్పి సంతకాలు చేయించుకొని రూ.23 లక్షలను సీసీ స్వాహా చేశారు. అప్పట్లోనే ఈ అవినీతిపై ఐటీ డీఏ పీఓ, ఏపీఎంలకు ఫిర్యాదు చేశాం. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అవినీతికి పాల్పడిన శ్రీనివాసరావును మరలా రాయగడజమ్ము క్లస్టర్కు సీసీగా నియమించారు. దీనిని చూస్తే అధికారులే అవినీతికి ప్రోత్సాహిస్తున్నట్లుందని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు గతంలో జరిగిన అవినీతికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని, శ్రీనివాసరావు ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చే శారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకు లు పువ్వల తిరుపతిరావు, బిడ్డిక శంకరరావు, సన్యాసిరావు, సుబ్బారావు పాల్గొన్నారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం
విజయనగరం ఫోర్ట్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎం.సురేష్బాబు అన్నారు. స్థానిక రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రక్తకొరత నివారణకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. రక్తదానం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది డి.మృదుల, రమేష్కుమార్, కె.రామచంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సోమవారం సాలూరులో పీజీఆర్ఎస్

సోమవారం సాలూరులో పీజీఆర్ఎస్