తల్లికి వందనం.. అమల్లో మోసం | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం.. అమల్లో మోసం

Jun 14 2025 9:54 AM | Updated on Jun 14 2025 9:54 AM

తల్లికి వందనం.. అమల్లో మోసం

తల్లికి వందనం.. అమల్లో మోసం

అమ్మ ఒడి పథకంలో ఉన్న నిబంధనలపై విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేశ్‌లు.. తల్లికి వందనం పథకం విషయంలో అంతకుమించి నిబంధనలు ఎందుకు తీసుకొచ్చారని రాజన్నదొర ప్రశ్నించారు. ‘గతంలో అమ్మఒడి సుమారు 80 లక్షల మందికి ఇచ్చాం.. ఒక్క విద్యార్థి చొప్పున అమలు చేస్తేనే అంతమంది. మీరు అందరికీ ఇస్తామన్నా రు. అందుకోసం మీరు ప్రత్యేకంగా ఎంత బడ్జెట్‌ కేటాయించారు. ఎందరికి కోత పెడుతున్నారు. కార్పొరేషన్ల నిధులు ఇటు మళ్లించారా? ఓట్లు దండుకోవడానికి ఎక్కువ మంది పిల్లలకు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు అన్ని నిబంధనలతో కొర్రీ పెడుతున్నారా?’ అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు తాము 70 శాతం హాజరు నిబంధన పెడితే.. ఇదే టీడీపీ విమర్శించిందని.. ఇప్పుడు ఉన్నది ఏమిటన్నారు. తాము పాఠశాల నిర్వహణ కోసం రూ.2 వేలు చొప్పున ఉంచితే కూటమి నేతలు గగ్గోలు పెట్టారని.. ఇప్పుడు రూ.13 వేలు ఇస్తామని జీవో ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఈ నిబంధనలు ఏవీ మీరు చెప్పలేదు. ఎన్నికలప్పుడు అందరి ఓట్లు కావాలి. ఇప్పుడు నిబంధనలతో భారీగా కోత పెట్టారు. వారి కన్నీళ్లు మీకు తగులుతాయి. ‘తల్లికి వందనం.. అమల్లో మో సం’ అని విమర్శించారు. జగన్‌ పోరాటం వల్లే ఇప్పుడైనా పథకం అమలు చేస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధు లు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement