మామిడి, పామాయిల్‌ మొక్కల ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

మామిడి, పామాయిల్‌ మొక్కల ధ్వంసం

Jun 13 2025 4:49 AM | Updated on Jun 13 2025 4:49 AM

మామిడ

మామిడి, పామాయిల్‌ మొక్కల ధ్వంసం

కోటసీతారాం పురంలో ఏనుగుల తిష్ఠ

సీతానగరం: మండలంలో దట్టమైన తోటలు న్న కోట సీతారాంపురంలో నాలుగు రోజులు గా ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. గ్రామానికి చెందిన అల్లు వాసు, సూర్యనారాయణకు చెందిన మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మామిడి తోటలో చెట్లను, పామాయిల్‌ తోటలో మొక్కలను ధ్వంసం చేశాయి. లక్షలు ఖర్చుచేసి మామిడి తోటను తయారు చేసి పంటకోతకు వచ్చే సమయానికి ఏనుగులు ధ్వంసం చేయడంతో అపారమైన నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం పంటనష్టాన్ని అంచనావేసి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

ఏనుగు పిల్లకు ‘సీత’గా నామకరణం

కోట సీతారాంపురం గ్రామంలో బుధవారం జన్మించిన ఏనుగు పిల్లకు ‘సీత’ అని ట్రాకర్స్‌, బీట్‌ అధికారులు, గ్రామస్తులు కలిసి నామకర ణం చేశారు. 8 ఏనుగుల గుంపుతో కోట సీతారాంపురం వచ్చిన ఏనుగుల గుంపులో పెద్ద ఏనుగు శిశువుకు జన్మనివ్వడంతో ఏనుగు ల గుంపు 9కి చేరింది.

విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి

విజయనగరం: గుజరాత్‌ లో జరిగిన విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందడంపై జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘోర దుర్ఘటన బాధాకరమన్నారు. విమానం హాస్టల్‌ భవనంపై కూలడంతో 35 మంది వైద్య విద్యార్థులు మృతి చెందడం, మరో 16 మంది తీవ్రంగా గాయపడడం హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. విమాన ప్రమాదాలను అరికట్టడంపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అత్యాచారం కేసులో

ముద్దాయికి 12 ఏళ్ల జైలు శిక్ష

విజయనగరం క్రైమ్‌: ఆండ్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండేళ్ల కిందట నమోదైన అత్యాచారం కేసులో ముద్దాయికి 12 ఏళ్ల జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ జిల్లా మహిళా కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. కేసు వివరాల్లోకి వెళితే.. మెంటాడ మండలం కుంటినవలసకు చెందిన మాదిరెడ్డి అప్పారావు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2023లో ఆండ్ర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి ఎస్‌ఐ సిద్ధార్థ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం గజపతినగరం సీఐ అప్పలనాయుడు నిందితుడిని అరెస్టు చేశారు. అభియోగపత్రాన్ని ఎస్‌ఐ ప్రభాకర్‌ కోర్టులో దాఖలు చేశారు. అప్పారావుపై నమోదైన కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో మహిళా కోర్టు ఐదవ అడిషనల్‌ జడ్జి పద్మావతి నిందితునికి శిక్ష ఖారారు చేస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితునిపై నేరం రుజువయ్యేలా పోలీస్‌శాఖ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శకుంతల వాదనలు వినిపించారు. సకాలంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మామిడి, పామాయిల్‌  మొక్కల ధ్వంసం1
1/1

మామిడి, పామాయిల్‌ మొక్కల ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement