చికెన్‌ | - | Sakshi
Sakshi News home page

చికెన్‌

Jun 11 2025 11:33 AM | Updated on Jun 11 2025 11:33 AM

చికెన

చికెన్‌

బ్రాయిలర్‌ లైవ్‌ డెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ107 శ్రీ184 శ్రీ194

ఆటో బోల్తా పడి గిరిజన మహిళ మృతి

పాచిపెంట: మండలంలోని పనుకువలస పంచాయతీ చీపురు వలస సమీపంలో మంగళవారం ఆటో బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో ఓ గిరిజన మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి, మండలంలోని చినచీపురువలస గ్రామానికి చెందిన కోట సోమమ్మ (64) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన కొంతమంది కూలీలతో కర్రివలస గ్రామంలో పత్తి చేను గొప్పు తవ్వకానికి ఆమె వెళ్లింది. వర్షం కారణంగా పని మధ్యలో ఆగిపోవడంతో, గ్రామస్తులతో కలిసి గ్రామానికి తిరిగి ఆటోలో వెళ్తుండగా చీపురువలస గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సోమమ్మకు తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 సహాయంతో సాలూరు సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. సోమమ్మ భర్త పారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట సురేష్‌ తెలిపారు.

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఇందుకు సంబంధించి జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు మంగళవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలమండ కంటకాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 30 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు మంగళవారం కనుగొన్నారు. మృతురాలి శరీరంపై గ్రీన్‌ కలర్‌, గోల్డ్‌ కలర్‌ అంచులు గల చీర, నలుపు రంగు జాకెట్‌ కలిగి ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. చామన ఛాయ రంగులో ఉండే ఆమె ఎడమ చేతి మోచేతిపై పచ్చబొట్టు ఉన్నట్లు ఎస్సై బాలాజీరావు చెప్పారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు ఫోన్‌ 9490617089, 08912883218 నంబర్లకు తెలియజేయాలని కోరారు.

మరో గుర్తు తెలియని వ్యక్తి..

విజయనగరం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని లీలామహల్‌ రోడ్డు వద్ద మంగళశారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 నుంచి యాభై ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి లీలామహల్‌ రోడ్డులో గల బార్‌ వద్ద పడి ఉండడంతో స్థానికులు చూసి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వెంటనే హాస్పిటట్‌ సిబ్బంది తమకు సమాచారం ఇచ్చినట్లు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని మృతదేహాన్ని గుర్తు పట్టేవారు ఫోన్‌ 9121109419 నంబర్‌కు సమాచారం తెలియజేయాలని కోరారు.

యువకుడి ఆత్మహత్య

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

విజయనగరం క్రైమ్‌: దగ్గరి వారికి తెలిసిన వారి నుంచి అప్పు ఇప్పించడమే ఆ యువకుడి తప్పయింది. డబ్బులు తీసుకున్న తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి వేధింపులను తట్టుకోలేక కోరుకొండకు చెందిన 27 ఏళ్ల యువకుడు శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. ఈ నేపథ్యంలో మృతుని స్నేహితులు, బంధువులు, కలెక్టరేట్‌ ముందు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనపై మృతుని కుటుంబసభ్యులు ఇటు జేసీకి, అటు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మృతుడి అన్నయ్య హరీష్‌ మాట్లాడుతూ తన తమ్ముడు అలమండ సంతలో అనుమానాస్పద స్థితిలో పడి ఉండడంతో విజయనగరం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడని చెప్పాడు. తమ్ముడి మృతదేహం వద్ద ఉన్న ఫోన్‌లో రికార్డ్‌ అయిన వాయిస్‌ల ద్వారా తెలుసుకున్న సమాచారం మేరకు నలుగురు వ్యక్తుల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పాడు. వెంటనే బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఏఎస్పీ ఆదేశాలతో సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని కలవగా ఫిర్యాదు ఆధారంగా నిందితులను పిలిచి మాట్లాడతామని ఎస్సై చెప్పారని వివరించాడు.

పురుగు మందు తాగి మరో యువకుడు..

వంగర: మండల పరిధిలోని అరసాడ గ్రామానికి చెందిన కడుముల వెంకటేష్‌ (19) మనస్తాపంతో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ నెల 9న గడ్డిమందు తాగిన వెంకటేష్‌ను బంధువులు రాజాం సీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి రెండేళ్ల క్రితం మృతిచెందగా తల్లి రమణమ్మ కూలిపనులు చేస్తోంది. ఏదైనా పని చేసుకోమంటూ కుమారుడికి హితవు చెప్పేది. దీంతో మనస్తాపం చెందిన వెంకటేష్‌ పురుగు మందు తాగేశాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌శంకర్‌ తెలిపారు.

చికెన్‌1
1/4

చికెన్‌

చికెన్‌2
2/4

చికెన్‌

చికెన్‌3
3/4

చికెన్‌

చికెన్‌4
4/4

చికెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement