వేధింపుల కేసులో ముద్దాయిలకు ఏడాది జైలు | - | Sakshi
Sakshi News home page

వేధింపుల కేసులో ముద్దాయిలకు ఏడాది జైలు

Jun 11 2025 11:33 AM | Updated on Jun 11 2025 11:33 AM

వేధింపుల కేసులో  ముద్దాయిలకు  ఏడాది జైలు

వేధింపుల కేసులో ముద్దాయిలకు ఏడాది జైలు

రూ.51వేల జరిమానా

విజయనగరం క్రైమ్‌: విజయనగరం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో 2018లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో ముగ్గురు ముద్దాయిలకు ఏడాది జైలు, రూ.51వేల జరిమానా విధిస్తూ విజయనగరం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి తీర్పు వెల్ల డించినట్లు మహిళా పోలీస్‌ స్టేషన్‌ డీఎస్పీ ఆర్‌.గోవిందరావు మంగళవారం చెప్పారు. కేసు వివరాల్లోకి వెళ్ళితే..విజయనగరానికి చెందిన ప్రవీణ గోగులకు తమిళనాడు రాష్ట్రంలోని పెరంబదూర్‌కు చెందిన పసుపులేటి జాషువాతో 2017లో పైళ్లెంది. వివాహ సమయంలో రూ.10 లక్షల కట్నం, మూడు తులాల బంగారు వస్తువులను కానుకగా కన్నవారు ఇచ్చారు. పైళ్లెన అనంతరం భర్త పసుపులేటి జాషువా, అతని తల్లిదండ్రులు భాస్కరరావు, సుజాతలు అదనంగా మరో రూ.5లక్షలు కట్నంగా తీసుకురావాలని శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడేవారని 2018 లో ఆగస్టు 6 వ తేదీన అప్పటి దిశ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేయగా అప్పటి మహిళా ఎస్సై ఎ.వెంకటరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో ఫిర్యాది భర్త పసుపులేటి జాషువా (ఎ1), మామ భాస్కరరావు (ఎ2) అత్త సుజాత (ఎ3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లు రుజువు కావడంతో పై విధంగా స్పెషల్‌ మొబైల్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున ఏపీపీ శాంతి గౌతమి వాదనలు వినిపించారు. అప్పటి ఎస్సై ఎ.వెంకటరావు దర్యాప్తు చేయగా, కోర్టు కానిస్టేబుల్‌ వై.పూర్ణ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారని డీఎస్పీ ఆర్‌.గోవిందరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement