కలగానే మినీ జలాశయం..! | - | Sakshi
Sakshi News home page

కలగానే మినీ జలాశయం..!

Jun 9 2025 7:43 AM | Updated on Jun 9 2025 7:43 AM

కలగాన

కలగానే మినీ జలాశయం..!

సోమవారం శ్రీ 9 శ్రీ జూన్‌ శ్రీ 2025
జంపరకోట పెద్దగెడ్డపై..

కూటమి నాయకులు

ఏమన్నారంటే..

2024 ఎన్నికల సమయంలో పాలకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పర్యటించిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువగళంలో భాగంగా ఇక్కడకు వచ్చిన నారా లోకేష్‌, వారాహి యాత్రలో నేటి డిప్యూటీ సీఏం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ జంపరకోట జలాశయం పనులు పూర్తికి కేవలం రూ.22 కోట్లు ఖర్చు చేస్తే చాలన్నారు. వేలాది ఎకరాలకు సాగు నీరు అందించి రైతుల కన్నీరు తుడవచ్చన్నారు. తాము అధికారంలోకి వస్తే... పాలకొండను బంగారు కొండగా మార్చేస్తాం.. ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. వారి మాటలు నమ్మారు. రైతులు ఓట్లేశారు. ఏడాది గడిచిపోయినా కూటమి నాయకులు ఇచ్చిన హామీల మేరకు ఈ జలాశయం పూర్తికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో రిజర్వాయర్‌ పరిసర ప్రాంతాలకు చెందిన గిరిజనులు, రైతులు తాము మళ్లీ మోసపోయామని గుర్తించారు. జంపరకోట పెద్దగెడ్డపై మినీ జలాశయం పూర్తి చేయాలని తమ పొలాలకు సాగునీరు అందేలా చూడాలని కోరుతున్నారు. దశాబ్దాల కిందట తమ నుంచి సేకరించిన భూములు వృథాగా వదిలేయడంతో రూపు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.

పాలకొండ రూరల్‌: ఆ గెడ్డపై మినీ రిజర్వాయర్‌ నిర్మాణం వ్యవసాయ ఆధారిత గ్రామాల్లో రైతుల మూడున్నర దశాబ్దాల కల. ఇది పూర్తయితే సుమారు రెండు వేల ఎకరాలకు పైబడి భూముల్లో మూడు పంటలు పండించేందుకు పుష్కల అవకాశం. అయినా పాలకులు పట్టించుకోలేదు. తాజాగా గత ఏడాది జరిగిన శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి పాలకొండ వచ్చిన కూటమి ముఖ్య నాయకులు ఆ జలాశయం పూర్తికి హామీలు ఇచ్చారు. కూటమి సర్కారు వచ్చింది.. ఏడాదైంది... అయినా సర్కారు చేపట్టిన చర్యలు శూన్యమే అని తేలిపోయింది. అదే పాలకొండ మండలం జంపరకోట పెద్దగెడ్డపై నిర్మిస్తామన్న మినీ రిజర్వాయర్‌ కథ.

0.1 టీఎంసీల నీటి సామర్థ్యంతో...

36 ఏళ్ల క్రితం పాలకొండ మండలం జంపరకోట పెద్దగెడ్డపై మినీ జలాశయం నిర్మాణానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎత్తైన మైదాన ప్రాంత గిరిజన గ్రామాలను అనుకుని ఉన్న కొండల్లో ఈ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. 0.1 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఈ జలాశయం పూర్తి చేయగలిగితే దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడి భూములకు సాగునీరు అందించవచ్చన్న సమున్నత లక్ష్యంతో ఈ పనులకు అప్పటి జలవనరుల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ జలాశయం పూర్తి చేయగలిగితే ఖరీఫ్‌, రబీ సీజన్లతో పాటు వివిధ రకాల పంటలు పండించవచ్చని జలాశయం దిగువన ఉన్న నాలుగు పంచాయతీల రైతులు భావించారు.

రూ.2.25 కోట్ల మేర అంచనాతో...

ఈ మినీ రిజర్వాయర్‌ నిర్మాణం ద్వారా మండలంలో జంపరకోట, డోలమడ, ఎం.సింగుపురం, జి.వెంకటాపురం, మల్లివీడు, లోవిడి లక్ష్మీపురం గ్రామాలకు చెందిన 8.50 హెక్టార్లలో ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. రూ.2.25 కోట్ల మేర అంచనాలతో తొలి దశలో పనులు ప్రారంభించారు. మినీ రిజర్వాయర్‌ పనుల కోసం జంపరకోట వద్ద 79.61 ఎకరాలను సేకరించారు. వివిధ కారణాలతో దాదాపు రెండు దశాబ్ధాలు నత్తనడకన పనులు కొనసాగాయి. అప్పట్లో రూ.36 లక్షల మేర ఖర్చు చేసింది. మట్టి పనులు, కాంక్రీటు పనులు చేపట్టి 2002లో పనులు నిలిపేశారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో రూ.15.32 కోట్ల అంచనాతో 2006లో పనులు పునః ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో 36.44 శాతం పనులు జరిగాయి. 2011నాటికి రూ.55 లక్షలు నిర్వాసితులకు నష్ట పరిహారం అందించారు. ఈ సమయంలో నిర్మాణ వ్యయం పెంచాలని కాంట్రాక్టర్‌ ఒత్తిడి చేయటంతో 2017లో ఒప్పందం రద్దు చేశారు. 2018లో టీడీపీ హయాంలో రూ.17.83 కోట్లతో నూతన ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో నిధులు అందించకపోవటం, వివిధ దశల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుని నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ క్రమంలో కాంట్రాక్టర్‌ 25 శాతం పనులు కూడా చేపట్టకపోవటంతో 2019లో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మొత్తం కాలంలో వైఎస్సార్‌ హయాంలో మినహా టీడీపీ చేసింది ఏమీ లేదు. తరువాత రాష్ట్రంలో వైఎస్సార్‌ పీసీ హయాంలో స్పందించి నాటి జగన్‌ సర్కార్‌ అత్యంత ప్రాధాన్యత క్రమంలోకి జంపరకోటను చేర్చింది. నిధులు అనుకున్న మేర కేటాయింపునకు చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వ మార్పు జరిగింది.

న్యూస్‌రీల్‌

మూడున్నర దశాబ్దాలుగా రైతుల ఎదురు చూపులు

ఎన్నికల వేళ కూటమి నేతల హామీలు

అధికారం చేపట్టి ఏడాదైనా సర్కారు చర్యలు శూన్యం

హామీని అమలు చేయాలంటున్న అన్నదాతలు

దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం..

జంపరకోట జలాశయం పూర్తి చేస్తారని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నాం. నేటికి 36 సంవత్సరాలు గడిచాయి. ఈ ప్రభుత్వం తన హయాంలో రిజర్వాయర్‌ కడితే వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది. రైతులు రెండు పంటలు పండించవచ్చు. పంటలు పండితే ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. మా పిల్లల భవిష్యత్‌ బాగుపడుతుంది. కూటమి చొరవ చూపి పనులు ప్రారంభించాలి. ప్రస్తుతం మా రైతులు జలాశయ ప్రాంతంలో ఉన్న వనరులు వినియోగించి తాత్కాలిక పంటలు వేసి జీవనం సాగిస్తున్నారు. – జి.చిన్నారావు,

బియ్యాలవలస, పాలకొండ మండలం

జీవితాలు బాగుపడతాయని..

జంపరకోట జలాశయ నిర్మాణానికి కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏ నాయకుడు ఇక్కడకు రావటం లేదు. ఏడాది గడిచినా పనులకు సంబంధించి ఎటువంటి చర్యలు లేవు. అప్పట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు, గిరిజనులు, రైతులు ఇక్కడ ఉన్న వనరులు కోల్పోయి పంటలు పండించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి రిజర్వాయర్‌ పూర్తి చేస్తే పంటలు పండితే మా జీవితాలు బాగుపడతాయి.

– నిమ్మక సింహాచలం,

గిరిజన రైతు, జంపరకోట

కలగానే మినీ జలాశయం..! 1
1/5

కలగానే మినీ జలాశయం..!

కలగానే మినీ జలాశయం..! 2
2/5

కలగానే మినీ జలాశయం..!

కలగానే మినీ జలాశయం..! 3
3/5

కలగానే మినీ జలాశయం..!

కలగానే మినీ జలాశయం..! 4
4/5

కలగానే మినీ జలాశయం..!

కలగానే మినీ జలాశయం..! 5
5/5

కలగానే మినీ జలాశయం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement