భువనేశ్వర్: మైనర్ బాలిక అపహరణ కేసుకు సంబంధించి పూరీ జిల్లా నిమాపడా పోలీసులు విచారించి విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఒక యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతుడిని దిహాబడి ప్రాంతానికి చెందిన సుబ్రత్ భొయ్ (18)గా గుర్తించారు. యువకుడి మృత దేహాన్ని పోలీస్ ఠాణా ముందు ప్రదర్శించి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కుటుంబీకుల ఆరోపణ పూర్తిగా అవాస్తవం అని ఠాణా అధికారులు ఖండించారు. మృతుని ముఖం ఎరుగనట్లు పోలీసు వర్గాల సమాచారం.
ఠాణా ఆవరణలో ఉద్రిక్తత


