జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉపాధ్యాయ విద్యా విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు విజయవంతంగా నేడు ముగిసింది. వర్సిటీ కులపతి ప్రొఫెసర్ డాక్టర్ దుర్గాప్రసాద్ మిశ్ర ప్రారంభోత్సవం చేయగా.. ఒడిశా పాఠ్యక్రమ రూపకల్పన బోర్డు–2026 అధ్యక్షుడు డాక్టర్ నిత్యానంద ప్రధాన్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా విద్యా విభాగాధిపతి భరత్ కుమార్ పండా, విశ్వవిద్యాలయ స్నాతకోత్తర పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంతకుమార్ పాత్రో, సదస్సు కార్యదర్శి డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ తదితరులు హాజరయ్యారు. – జయపురం


