
గుభాళింపు
పవిత్ర యోగిని ఏకాదశిని శ్రీక్షేత్రంలో ఖొల్లి లగ్గి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు మరియు సుదర్శన మూల విరాటులకు శనివారం గంధం పూశారు. జ్యేష్ట పూర్ణిమ నుంచి దేవుళ్లు అస్వస్థతకు గురై తెరచాటున గోప్య ఉపచారాలతో క్రమంగా కోలుకున్నారు. ఖొల్లి లగ్గి ఏకాదశి నాడు జగన్నాథుడు సోదర సోదరి సమేతంగా పూర్తిగా స్వస్థత పొందడంతో చందన లేపనం చేసి తులసీ దళాలు ఇతరేతర సుగంధిత పుష్పాలతో పూజించారు. ఆరోగ్యం మరింత త్వరగా కోలుకోవాలని దశమూల మోదకాలు నివేదించారు.
– భువనేశ్వర్