
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
● ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా
పూరీ సాగర తీరంలో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
కొరాపుట్: నబరంగ్పూర్లో కుమార్తెతో కలిసి యోగాసనం వేస్తున్న బీజేపీ నాయకుడు
మృత్యుంజయ్ దాస్
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా శనివారం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, మైదానాల్లో యోగా శిబిరాల్లో భాగంగా ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. యోగాతో మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుందని తెలియజేశారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని పేర్కొన్నారు.
– సాక్షి నెట్వర్క్
భువనేశ్వర్: యోగా వేడుకల్లో సాంస్కృతిక నృత్య ప్రదర్శన
భువనేశ్వర్: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని సీఎం మోహన్చరణ్ మాఝీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక కళింగ స్టేడియంలో రాష్ట్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ రాష్ట్రస్థాయి యోగా వేడుకలు శనివారం నిర్వహించింది. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం లేదా ఆసనాలకు పరిమితం కాదన్నారు. యోగా శారీరక, మేధో, మానసిక మరియు ఆధ్యాత్మికం యొక్క ప్రత్యేకమైన సంగమమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయాల్లో యోగా అంతర్భాగని తెలిపారు. పాఠశాల కార్యక్రమాలు మరియు ప్రజారోగ్య కార్యక్రమాల్లో యోగాను చేర్చడానికి ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ ప్రభుత్వ అధికారులు సహా దాదాపు 15,000 మంది పాల్గొన్నారు.
న్యూస్రీల్

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025

ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025