
రథయాత్ర నిర్వహణపై సమీక్ష
మల్కన్గిరి: ఈనెల 27వ తేదీ నుంచి జూలై 5 వరకు చేపట్టనున్న రథయాత్ర నిర్వహణపై స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ అధ్యక్షతన సమీక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ముందుగా పోలీసులు రథ చక్రాల స్థితి పరిశీలన చేయాలన్నారు. వాహనాల నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ బాధ్యతను వారికి అప్పగించారు. రథం లాగే సమయంలో అందుబాటులో అంబులెన్స్తో పాటు వైద్యుడు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది సైతం అందుబాటులో ఉండాలని సూచించారు. పట్టణంలోని ముఖ్యమైన చోట్ల నీటి ట్యాంకులు అందుబాటులో ఉంచాలని పీహెచ్డీ విభాగ సహాయక ఇంజినీర్కు అదేశించారు. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులను స్వచ్ఛందంగా సేవల కోసం నియమించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శొబరో, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, తహసీల్దార్ టికును పుటా, ఐఐసీ రీగాన్కీండో, డీఐపీఆర్వో ప్రమిళా మాఝి తదితరులు పాల్గొన్నారు.