
ట్రైనీ ఓఏఎస్ల క్షేత్రస్థాయి పర్యటనలు
కొరాపుట్: శిక్షణలో ఉన్న ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేశారు. శనివారం కొరాపుట్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను సందర్శించారు. త్వరలో పరిపాలనా పగ్గాలు చేపట్టనున్న ఈ యువ అధికారులు గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం కొరాపుట్ కాఫీ బోర్డు సమీక్షా సమావేశం నిర్వహించారు. నందపూర్, కొరాపుట్, బొయిపరిగుడ, జయపూర్ సమితుల్లో కాఫీ పంటలు పండిస్తున్న రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. వీరికి జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ వర్మలు ధ్రువపత్రాలు అందజేశారు.

ట్రైనీ ఓఏఎస్ల క్షేత్రస్థాయి పర్యటనలు