
ఆర్చరీలో షణ్ముఖి సత్తా
భవానీపురం(విజయవాడపశ్చిమ): సింగపూర్లో ఈ నెల 15వ తేదీ నుంచి జరుగుతున్న ఆర్చరీ ఏషియా కప్ స్టేజ్ సెకండ్ అండర్ 21 ఉమెన్ ఆర్చరీ పోటీలో విజయవాడ విద్యాధరపురానికి చెందిన బుద్దె షణ్ముఖి నాగ సాయి సత్తా చాటింది. పోటీల్లో భాగంగా సోమవారం నిర్వహించిన వ్యక్తిగత ర్యాంకింగ్ అండర్ 21లో షణ్ముఖి 350 ప్లస్ 356 (706) పాయింట్లు స్కోర్ చేసి మిక్స్డ్ టీం విభాగం, మహిళల టీం విభాగంలోను భారతదేశం ప్రపంచ రికార్డ్స్ సొంతం చేసుకోవడంలో కృషి చేసింది. ఈ సందర్భంగా పలువురు ఆర్చరీ క్రీడాకారులు ఆమెను అభినందించారు. కాగా బుద్దె షణ్ముఖి నాగ సాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.