
లింబాద్రి గుట్ట మీదుగా టెంపుల్ కారిడార్
సీఎంతో మాట్లాడిన రైతులు..
గత ప్రభుత్వ హయాంలో ఎదురైన ధరణి సమస్యలను పరిష్కరించాలని రైతులు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రైతులను సీఎం రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడించి భూభారతి లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బ ల్మూరి వెంకట్, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు మదన్ మోహన్, భూపతిరెడ్డి, లక్ష్మీకాంతారావు, మాజీ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మో హన్రెడ్డి వెంట రాగా అక్కడి నుంచి గోల్ బంగ్లా, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వర కు పాద యాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తా మీదుగా పెర్కిట్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగించారు. పెర్కిట్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఎ న్నికల హామీలను 80 శాతం పూర్తి చేశామని, రా నున్న రోజుల్లో వంద శాతం హామీలను నెరవేరుస్తామన్నారు.
ఆర్మూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి వేములవాడ, లింబాద్రి గుట్ట మీదుగా బాసర వరకు నా లుగు లేన్లతో టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో కారిడార్ మంజూరవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్ కుమార్గౌడ్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్రను శని వారం నిర్వహించారు. ఆర్మూర్లోని ఆలూర్ రోడ్డు లో మహేశ్కుమార్గౌడ్ కాంగ్రెస్ జెండాను ఆవిష్క రించగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను ప్రారంభించారు. కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘ భవనంలో రైతులు, లబ్ధిదారులతో మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షుల జిల్లాను అభివృద్ధి చేస్తాం..
టీపీసీసీ అధ్యక్షుల జిల్లా అయిన నిజామాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉత్తర తెలంగాణలోనే మేటి జిల్లాగా తీర్చిదిద్దుతామని మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. డి శ్రీనివాస్ రెండు పర్యాయాలు తాను మొదటి సారి ఈ జిల్లా నుంచే టీపీసీసీ స్థానాలకు ఎంపికయ్యామన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల మంజూరైందని, త్వర లో వ్యవసాయ కళాశాలను సైతం ఏర్పాటవుతుందని హామీ ఇచ్చారు. అన్ని సౌక ర్యాలతో జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మిస్తామన్నారు. లింబాద్రి గుట్ట వద్ద గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నామన్నారు. సిద్దుల గుట్టకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్య లు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో వినామానాశ్రయం సైతం ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కార్డియాక్ సెంటర్ను ఏర్పా టు చేయడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. గుళ్లు బీజేపీ సొత్తు కా దని, తాము కూడా శ్రీరామ చంద్రుడిని పూజిస్తామని, ఎన్నికల్లో ఓట్ల కోసం దేవుడిని వాడుకోబోమన్నారు. ఆర్మూర్లో గంగిరెద్దులాయన ఎ మ్మెల్యేగా చేసి తన కాంప్లెక్సులు కట్టుకొని ఆర్టీసీకి బకాయి ప డి ముఖం చాటేసాడని ఆరోపించారు. తాము బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంటే బిల్లు సిద్ధం చేస్తు న్న సమయంలో జైలులో ఉన్న మాజీ ఎంపీ కవిత తాను చేసినట్లు రంగు పూసుకొనే ప్రయత్నం చే స్తోందని ఎద్దేవా చేశారు. డీలిమిటేషన్తో పెరిగిన సీట్లను సైతం గెలుచుకుని అధిష్టానానికి బహు మ తిగా ఇస్తామన్నారు. అంతకు ముందు ఏఐసీసీ కా ర్యదర్శి సంపత్, ఇన్చార్జి మంత్రి సీతక్క, మాజీ ఎంపీ మధుయాష్కి మాట్లాడారు. ఆర్మూర్, బా ల్కొండ నియోజకవర్గాల ఇన్చార్జులు వినయ్రెడ్డి, సునీల్రెడ్డి, నాయకులు ఆకుల లలిత, కోల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి నుంచి బాసర వరకు..
తెలంగాణ యూనివర్సిటీలో
వ్యవసాయ కళాశాల
జీజీహెచ్లో కార్డియాక్ సెంటర్కు
వైద్యారోగ్య మంత్రి సానుకూల స్పందన
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
రిజర్వేషన్లు
ఆర్మూర్లో జనహిత పాదయాత్రలో
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్
80శాతం హామీల అమలు: మీనాక్షి

లింబాద్రి గుట్ట మీదుగా టెంపుల్ కారిడార్