
నేటితరానికి యోగా నేర్పించాలి
జిల్లా కోర్టులో ఆసనాలు వేస్తున్న జడ్జి, ఉద్యోగులు
జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే ధన్ పాల్, సీపీ
రైల్వే ప్లాట్ ఫాంపై యోగా చేస్తున్న సిబ్బంది
నిజామాబాద్నాగారం: యోగ మన ప్రాచీన సంప్రదాయం నుంచి వచ్చిన ఒక అమూల్యమైన బహు మతి అని, దానిని నేటితరానికి అందించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆయుష్ జిల్లా శాఖ ఆ ధ్వర్యంలో శనివారం నగరంలోని శ్రీరామ గార్డెన్ లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఎమ్మెల్యే ధన్పాల్, సీపీ సాయి చైతన్య హాజరై ఆసనాలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కుటుంబం రోజువారీ దినచర్యలో యో గాను జోడించుకోవాలని పిలుపునిచ్చారు. యోగా ను ప్రపంచదేశాలకు పరిచయం చేసిన ఫనత మన దేశానికి దక్కుతుందన్నారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ ప్రజలు నిత్యం యోగా సాధన చేయాలని, యోగా మధుమేహం, రక్తపోటు వ్యాధులను నివారిస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జే గంగాదాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, సూదం లక్ష్మి, జిల్లా లేబర్ ఆఫీసర్ యోహాను, రెడ్క్రాస్ ప్రతినిధులు బుస ఆంజనేయులు, తోట రాజశేఖర్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రతినిధులు యోగా రాంచందర్, ప్రభాకర్, సంగీత, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి
తెయూ(డిచ్పల్లి): ఆరోగ్యంగా ఆనందమయ జీవితం గడపడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి పేర్కొన్నారు. తెయూ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రిజిస్ట్రార్ యాదగిరి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కే రవీందర్రెడ్డి, పీఆర్వో పున్నయ్య, యోగా గురువు సిద్ధిరామయ్య పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
డిచ్పల్లి : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని డిచ్పల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ కమాండెంట్ పీ సత్యనారాయణ పేర్కొన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం బెటాలియన్లో 11 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కేపీ శరత్కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ జైలులో..
నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ సెంట్రల్ జైలులో సూపరింటెండెంట్ చింతల దశరథం ఆధ్వర్యంలో శనివారం యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా 550 మంది ఖైదీలతోపాటు జైలు సిబ్బంది, యోగా మాస్టర్లు, పిరమిడ్ స్పిరీచువల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగా మాస్టర్ జలందర్గౌడ్, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయిలు మల్లుగౌడ్, పి.రజితవాణి, వెంకటేశ్, మహేశ్, పతంజలి యోగా కేంద్రం సా యిలు, మాస్టర్లు ప్రభాకర్, జైలర్లు అనిల్ కుమార్, మన్మఽథరావు, డిప్యూటీ జైలర్లు అశోక్ కుమార్, నారాయణ, ఏడీజే నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కోర్టులో..
నిజామాబాద్ లీగల్: జిల్లా కోర్టులో నిర్వహించిన యోగా దినోత్సవానికి ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా యోగా గురువు అందె జీవన్రావుతోపాటు యోగా మాస్టర్లు సంగీత, ఎంఎస్ చౌదరీలు న్యాయమూర్తులు, న్యాయవాదులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో మహిళా కోర్టు జడ్జి హరీశ, సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధా, న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర రావు, జూనియర్ సివిల్ జడ్జి గోపికృష్ణ, న్యాయమూర్తులు కుష్బు ఉపాధ్యాయ, శ్రీనివాస్ రావు, హరి కుమార్, పీపీ మామిడాల సుదర్శన్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్
అట్టహాసంగా అంతర్జాతీయ
యోగా దినోత్సవం