
నిందితుడి అరెస్టు
ఖలీల్వాడి: రైలులో సెల్ఫోన్లను దొంగతనం చేసిన యువకుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో సిబ్బంది ఒకటో నంబర్ ప్లాట్ఫాం మీద విధులు నిర్వహిస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని విచారించారు. నగరంలోని ద్వారకానగర్కు చెందిన సయ్యద్ మాజీద్ (27)గా గుర్తించారు. ఈ నెల 19న నాగర్సోల్, షీర్డీ సాయినగర్ రైలులో మూడు సెల్ఫోన్లను దొంగిలించినట్లు చెప్పారు. సెల్ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. దొంగను పటుకున్న హెడ్కానిస్టేబుల్ సురేందర్, గురువాస్, కానిస్టేబుల్ రాములును ఎస్సై అభినందించారు.