నిందితుడి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నిందితుడి అరెస్టు

Jun 22 2025 7:13 AM | Updated on Jun 22 2025 7:13 AM

నిందితుడి అరెస్టు

నిందితుడి అరెస్టు

ఖలీల్‌వాడి: రైలులో సెల్‌ఫోన్లను దొంగతనం చేసిన యువకుడిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం ఉదయం 10:30 గంటల సమయంలో సిబ్బంది ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం మీద విధులు నిర్వహిస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని విచారించారు. నగరంలోని ద్వారకానగర్‌కు చెందిన సయ్యద్‌ మాజీద్‌ (27)గా గుర్తించారు. ఈ నెల 19న నాగర్‌సోల్‌, షీర్డీ సాయినగర్‌ రైలులో మూడు సెల్‌ఫోన్లను దొంగిలించినట్లు చెప్పారు. సెల్‌ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. దొంగను పటుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ సురేందర్‌, గురువాస్‌, కానిస్టేబుల్‌ రాములును ఎస్సై అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement