
క్రైం కార్నర్
అనుమానాస్పదస్థితిలో పార్ట్టైం లెక్చరర్ మృతి
● దుర్కి బాలికల గిరిజన పాఠశాలలో ఘటన
నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి గ్రామంలో గల తెలంగాణ గిరిజన బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పార్ట్టైం కెమిస్ట్రీ అధ్యాపకురాలు స్వప్న(33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె సన్నిహితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేటకు చెందిన స్వప్న దుర్కిలోని గిరిజన గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. కాగా, గురువారం సూర్యపేట్ జిల్లా కోదాడలో టెట్ రాసిన స్వప్న, శుక్రవారం విధులకు హాజరైంది. రోజంతా పని చేసినా రాత్రి డ్యూటీ వేశారు. దీంతో రాత్రి పిల్లలను చదివించి నిద్రపోయింది. విద్యార్థినులు ఎంత లేపినా లేవకపోవడంతో సిబ్బంది ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నామని ఎస్సై లావణ్య తెలిపారు. ఇదిలా ఉండగా స్వప్నకు ఆరోగ్యం బాగోలేక పోయినా ప్రిన్సిపల్ డ్యూటీ వేసి పని ఒత్తిడి కల్పించి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి వృద్ధులైన తల్లిదండ్రులు, ఇంటర్ చదివే తమ్ముడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దికై ్కన కూతురు మరణించడంతో బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.
చికిత్స పొందుతూ యువకుడు..
ఇందల్వాయి: గన్నారం గ్రామానికి చెందిన నాగుల హరి(22) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగిన హరిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా శనివారం మరణించాడు. హరి ఆత్మహత్య కు గల కారణాలు తెలియరాలేదని, మృతుడు టోల్ప్లాజా వద్ద ఫాస్ట్ టాగ్లు విక్రయిస్తుండేవాడని తెలిపారు. తండ్రి దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య
బాన్సువాడ : బాన్సువాడ నాగయ్య చెరువులో దూకికొండని గంగవ్వ(70) ఆత్మహత్యకు పాల్పడింది. పాత బాన్సువాడ గూడెంగల్లీకి చెందిన గంగవ్వ అనారోగ్యంతో బాధపడుతోంది. గంగవ్వ కుమారుడు రాజు తన అత్తగారి ఊరైన దేశాయిపేట్లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. గంగవ్వ మాత్రం బాన్సువాడలోనే ఉంటుంది. వారం రోజుల క్రితం నుంచి గంగవ్వ కుమారుడు, కోడలు వచ్చి గంగవ్వ ఇంట్లోనే ఉంటున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన గంగవ్వ సాయంత్రం చెరువులో శవమై కనిపించింది. మృతురాలి కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్