
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
● సబ్ కలెక్టర్ వికాస్ మహతో
బోధన్టౌన్/బోధన్: మహిళలు వంటలతోపాటు వ్యాపార, క్రీడ, విద్యా, ఇతర సామాజిక రంగాల్లో రాణించాలని సబ్కలెక్టర్ వికాస్ మహతో పేర్కొన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెప్మా, బల్దియా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులతో శనివారం బల్దియా కార్యాలయ ఆవరణలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిచారు. ఫుడ్ ఫెస్టివల్ను సబ్కలెక్టర్ ప్రారంభించి, మహిళా సంఘాల సభ్యులు చేసిన వివిధ వంటకాలను రుచి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, మహిళామణులు చేసిన వంటకాలతోపాటు పచ్చళ్లకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణ, మెప్మా టీం లీడర్ శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్, బల్దియా మేనేజర్ రమేశ్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా జైలులో..