కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలి

Jun 22 2025 7:13 AM | Updated on Jun 22 2025 7:13 AM

కౌశిక

కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలి

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌ : ఎలాంటి నోటీసులు లేకుండా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అక్రమమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలన ప్రజాపాలన కాదని, రాచరిక పాలన, నియంత పాలనగా మారిందన్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి జీర్ణించుకోవడం లేదన్నారు. రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడంలో ఉన్న శ్రద్ధ హామీలు అమలు చేయడంలో లేదన్నారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై తమకు నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని ప్రకటనలో పేర్కొన్నారు.

మంత్రి అడ్లూరిను కలిసి ఎమ్మెల్యే

డిచ్‌పల్లి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఇటీవ ల బాధ్య తలు స్వీకరించిన అ డ్లూరి లక్ష్మణ్‌ను నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.

యాదగిరిగుట్ట,

స్వర్ణగిరి తీర్థయాత్ర

ఆర్మూర్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు

ఆర్మూర్‌టౌన్‌: భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ డిపో ఆర్మూర్‌ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు మేనేజర్‌ రవికుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 27న యాత్రకు 36 సీట్ల సామర్థ్యం గల ప్రత్యేక బస్సు బయల్దేరుతుందని పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకు ఆర్మూర్‌ డిపో నుంచి ప్రారంభమై తిరిగి రాత్రి 10 గంటలకు ఆర్మూర్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్రకు ఒక్కరికి రూ.1500 ల చార్జీ ఉంటుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కలెక్టర్‌ను కలిసిన నుడా చైర్మన్‌

నిజామాబాద్‌ సిటీ: కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డిని నుడా చైర్మన్‌ కేశ వేణు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం కలెక్టర్‌ చాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నుడా తరఫున చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ అందజేసేందుకు ఆదివారం పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ వస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో వస్తున్న సమస్యలను కలెక్టర్‌కు వివరించారు.

కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలి 1
1/1

కౌశిక్‌రెడ్డిని విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement