
ప్రజా సేవ కోసమే పదవులు
● రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి
ఆర్మూర్ : ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో భాగంగా పదవులు వస్తాయని, ఆ పదవులను ప్రజాసేవకు వినియోగించాలని రాజ్యసభ సభ్యు డు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పరిధిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఇటీవల రైల్వే బోర్డు, టెలికాం శాఖ డైరెక్టర్లుగా నామినేట్ అయిన బొడ్డు గంగాధర్, సాయి రెడ్డి, ప్రసాద్ గౌడ్, తాజుద్దీన్, మోహన్, భాస్కర్, మంథని అజయ్, సింగిడి మోహన్ రెడ్డిలకు నియామకపత్రాలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్ తమ బృందంతో కలిసి కేఆర్ సురేశ్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షుడు దాసరి సునీల్, గంగామోహన్ చక్రు, అర్గుల్ సురేశ్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.